మణికొండ, అక్టోబర్ 31: విదేశాల్లో ఉన్నత విద్య అనే గమ్యాన్ని చేరుకోవడానికి వై-యాక్సిస్ సరైన వేదిక అని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల(సీబీఐటీ) ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎన్ఎల్ఎన్రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని సీబీఐటీలో సోమవారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సౌజన్యంతో వై-యాక్సిస్ కన్సల్టెంట్ ఆధ్వర్యంలో ‘అవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ సదస్సు నిర్వహించారు.ఎన్ఎల్ఎన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం చేయాలకొనేవారికి చక్కటి వేదిక వైయాక్సిస్ అని తెలిపారు. ఈ సంస్థతో కలిసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికల యాజమాన్యం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక చొరవచూపడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. వై-యాక్సిస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లాలనుకొనేవారికి తమ సంస్థ మార్గదర్శనం అందిస్తుందని వివరించారు. బీటెక్ చదివిన విద్యార్థులు తమ సంస్థ ద్వారా శిక్షణ పొందితే భవిష్యత్తులో ఎక్కడకు వెళ్లాలన్నా దగ్గరుండి సహకరిస్తామని చెప్పారు. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా, యూకే, యుఏఈ తదితర దేశాలకు సందర్శకుల వీసా, విద్యార్థుల వీసా, అడ్మిషన్, ఉద్యోగ వీసా, వ్యాపార ఆధారిత ప్రవేశ వీసా, పీఆర్ వీసా, ఎక్స్ప్రెస్ఎంట్రీ వంటి సేవలను అందజేస్తామని తెలిపారు. విదేశీ యూనివర్సిటీలకు ఏటా 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకొంటున్నా.. 20 నుంచి 25 వేల మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారని, సరైన అవగాహన, ప్రణాళిక లేకపోవడమే కారణమన్నారు. 2020-22లో వైయాక్సిస్ ద్వారా యూకే-1.17లక్షల మంది, యూఎస్ఏ-82 వేలు, కెనడా-లక్షా 16 వేల మంది, ఆస్ట్రేలియా- 34వేలు, యూరోప్-1.60 లక్షలు, సింగాపూర్-11వేల మందిచొప్పున పంపించామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ రవీందర్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ సీ ఓబులారెడ్డి, డాక్టర్ జీఎన్ఆర్ ప్రసాద్, సీహెచ్ హరీశ్, ‘తెలంగాణ టుడే’, ‘నమస్తే తెలంగాణ’ మేనేజర్లు గణేశ్, మహేశ్, సుమారు 4 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చక్కటి వేదిక వై యాక్సిస్
తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కటి భవిష్యత్తును అనుభవించాలని, ఉన్నతంగా జీవించాలని ఆకాంక్షిస్తుండటం సహజం. కలలను సాకారం చేసుకోవాలంటే ముందస్తు ప్రణాళికలు, ఆలోచనలను సక్రమంగా అమలు చేసుకోవాలి. అందుకు అవసరమైన మెళకువలను నేర్పేందుకు వై యాక్సిస్ కన్సల్టెంట్ దిగ్గజ సంస్థలతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు వినూత్నరీతిలో అడుగులు వేయడం అభినందనీయం. సమకాలీన ప్రపంచంలో ఉద్యోగ, వ్యాపారరీత్యా ముందుకు సాగేందుకు, ఇతర అవకాశాలను ఒడిసి పట్టుకొనేందుకు వై యాక్సిస్ సంస్థ ఓ చక్కటి వేదిక. ప్రధానంగా విదేశాల్లో విద్యనభ్యసించాలనుకొనే విద్యార్థులకు సువర్ణ అవకాశం. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు సకాలంలో ప్లాన్ చేసుకొని, వై యాక్సిస్ కన్సల్టెంట్ సంస్థను ఆశ్రయిస్తే మంచి భవిష్యత్తు దొరుకుతుందని నా అభిప్రాయం. – డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ప్లేస్మెంట్ అధికారి, సీబీఐటీ