హైదరాబాద్, జనవరి 12: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ సెలెక్ట్ మొబైల్స్ హైదరాబాద్లోని స్టోర్లో షావోమీ సరికొత్త మోడల్ 11ఐ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రముఖ సినీతార అనన్య నాగళ్ళ విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఈడీ మురళి రేతినేని మాట్లాడుతూ..ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్, కొత్త మోడళ్ళను ప్రవేశపెట్టడంలో సెలెక్ట్ మొబైల్స్ ముందు వరుసలో ఉంటుందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ షావోమీ 11ఐ 5జీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
రూ.7 వేల విలువైన స్మార్ట్ వాచ్+నెక్ బ్యాండ్ కేవలం రూ.1,999కే
రూ.5,199 విలువ కలిగిన బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్వాచ్ కేవలం రూ.1,999కే
టీవీ, ట్యాబ్ కొనుగోలుపై 5 వేల వరకు క్యాష్బ్యాక్
32 జీబీ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.1,500 విలువైన టీడబ్ల్యూఎస్ ఉచితం
ఎంపిక చేసిన మొబైళ్ళపై 75 శాతం వరకు తగ్గింపు