హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని మోడల్ విలేజ్ అయిన దేవుని నర్మెట్ట గ్రామాన్ని దీప్షిక యాదుగిరి నేతృత్వంలోని వోక్సెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ గ్రూప్, అధ్యాపకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలకు, బాలికలను ప్రోత్సహించేందుకు పలు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. 40 మంది విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ, ఫిట్నెస్, కీడ్రల ప్రాధాన్యంతో పాటు యువతులకు కెరీర్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా దీప్షిక మాట్లాడుతూ రైతులకు, కళాకారులకు చేతివృత్తుల్లో కొత్త పోకడలు వారి ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయన్నారు. గ్రామీణ మహిళలు, బాలికల సాధికారతపై పరిశోధనలు చేశామని తెలిపారు. సుచిరిండియా ఫౌండేషన్తో కలిసి గ్రామం సమగ్రాభివృద్ధికి దత్తత తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు షహనాజ్ రెహమాన్, సంగీత వర్మ, వీణాశర్మ, గ్రామ సర్పంచ్ అజీజ్తో పాటు మహిళా సంఘాల సభ్యులు, కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.