యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి బుధవారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శణానంతరం రవీందర్రెడ్డికి అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.