హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి మునుపెన్నడూ లేని రీతిలో సోషల్ మీడియా సెగ తగిలింది. వ్యతిరేక ట్వీట్లతో నెటిజన్లు ఆయనపై సునామీలా విరుచుకుపడ్డారు. మోదీపై వ్యతిరేకతను, అసమర్థ కేంద్రంపై కోపాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కారు. ముఖ్యంగా ట్విట్టర్లో ‘గోబ్యాక్ మోదీ’ హ్యాష్ట్యాగ్తో చెడుగుడు ఆడుకొన్నారు. ప్రధాని మోదీ గురువారం తెలంగాణ, తమిళనాడుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాలకు చెందిన నెటిజన్లు మోదీపై సునామీలా విరుచుకుపడ్డారు. ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి…’ అనే సినిమా డైలాగ్ ైస్టెల్లో ఒకేసారి బీజేపీకి, మోదీకి ముచ్చెటలు పట్టించారు. నెటిజన్ల దెబ్బకు ‘గోబ్యాక్ మోదీ’ హ్యష్ట్యాగ్పై దాదాపు నాలుగు లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. ఈ హ్యాష్ట్యాగ్ దేశంలో సుమారు 21 గంటల పాటు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా చూసినా ట్విట్టర్లో కొన్ని గంటల పాటు టాప్ 3లో ఉండటం గమనార్హం. మరికొందరు ఫాసిస్ట్ మోదీ అనే హ్యాష్ట్యాగ్పై ట్వీట్లు చేశారు. సుమారు లక్ష ట్వీట్లు పడ్డాయి. కొందరు మోదీకి అనుకూలంగా ట్వీట్లు చేసినప్పటికీ, వ్యతిరేక సునామీలో అవి కొట్టుకొనిపోయాయి.
ఏం మొఖం పెట్టుకొని వచ్చావ్?