హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి సమావేశాలకు రైతు సంఘం నేత కోటపాటి నరసింహం నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు తనకు ఎన్జీవో కోటాలో డబ్ల్యూటీవో ఆహ్వానం పంపించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి ఆయన ఒక్కరికే ఆహ్వానం అందడం గమనార్హం. రైతులకు సంబంధించిన సమస్యలను, వారి ఆర్థిక ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తానని కోటపాటి చెప్పారు.