హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న ప్రీఫ్యాబ్రికేటెడ్ భవనాల నిర్మాణంపై నవంబర్ 29, 30 తేదీల్లో జాతీయ వర్క్షాప్ జరుగనున్నది. జేఎన్టీయూ, వరంగల్ ఎన్ఐటీ సంయుక్తంగా జేఎన్టీయూలోని యూజీసీ ఆడిటోరియంలో దీనిని నిర్వహించనున్నాయి. వర్క్షాప్ పోస్టర్ను జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మంగళవారం జేఎన్టీయూలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ ప్రభుకుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి సంగా శ్రీనివాసులు, ప్రొఫెసర్ పీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.