హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి వివేక్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలను జీరో చేయడమే తమ లక్ష్యమని, యాజమాన్యాలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. 55వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల భద్రత విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు, పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు పాల్గొన్నారు.