నిర్మల్, జనవరి 14 : జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ పనుల్లో వేగం పెంచాలి, ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆర్ అండ్ బి అధికారులను, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించేందుకు రూ. 56 కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్ననామన్నామని, ఆదిశగా పనులు వేగవంతం కావలన్నారు. ఏప్రిల్ నాటికి అన్ని పనులు చేస్తే, మే నెలలో ప్రజలకు సేవలను అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, త్వరలోనే నిర్మల్ జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజ్ రాబోతుందని, ఈ అంశం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.