హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా, బజార్ హత్నూరు మండలం వర్తమన్నూరు గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం జియోైగ్లెఫ్ చిత్రాలను గుర్తించింది. వర్తమన్నూరు గ్రామానికి చెందిన గుంజల భాస్కర్రెడ్డి పొలంలో భారీ వోల్కనాయిక్ షీట్రాక్ వున్నది. ఆ రాతిపొరపై కనిపిస్తున్న రూపాలను చూడగానే చేయితిరిగిన శిల్పి చెక్కిన శిల్పాలవలె కన్పిస్తున్నాయి. లింగాలు, మనుషులు, పక్షులు, వివిధ డిజైన్లుగా, ఒకచోట మొసలి ఆకారంలో చూపరులకు కనువిందు చేసే ఆకృతులు ఉన్నాయి. ఇటీవల వీటిని పరిశీలించిన రాతిచిత్ర నిపుణులు ఎన్ చంద్రమౌళి, బండి మురళీధర్రెడ్డి.. ఇవి సహజంగానే ఏర్పడ్డ షీట్రాక్ మీద కనిపించే జియోగ్లైఫ్స్ అని తెలిపారు. భూమి ఉపరితలంపై లావా ప్రవహించినపుడు ఈ ప్రాకృతిక రూపాలు ఏర్పడ్డాయని చరిత్రకారులు సముద్రాల సునీల్, కట్టా శ్రీనివాస్ చెప్పారు. ఈ ఆకారాలు జియోలాజికల్ స్ఫిరాయిడల్ వెథరింగ్, డిఫరెన్షయల్ వెథరింగ్ ఏర్పడ్డాయని ప్రముఖ జియాలజిస్టులు చకిలం వేణుగోపాలరావు, సౌరభ్పాల్ అభిప్రాయపడ్డారు. బసాల్ట్ వల్కానిక్ టుఫ్తో ఉండటంవల్ల మనుషులే చెక్కారా అన్నంత చక్కటి ఆకృతులు ఏర్పడ్డాయని వివరించారు. ఈ శిలల వయసు దాదాపు 6.5 కోట్ల ఏండ్లు ఉంటుందని చెప్పారు.