హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మహిళలపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 21న గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంగా ఫిరోజ్ఖాన్ మహిళలను అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో అతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఫిరోజ్ఖాన్ వ్యాఖ్యలు మహిళల పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని కమిషన్ భావించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈనెల 4న విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.