హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నది. ఇప్పటివరకూ విపరీతంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు.
బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు బీడీలు చుడుతూ కనిపించారు. ఈ ఘటనను కెమెరాలో బంధించిన ఒకరు సోషల్ మీడియాలో పెట్టగా, వైరల్గా మారింది. వీడియో కింద నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఫ్రీ బస్ ఎఫెక్ట్ అంటూ చురకలంటిస్తున్నారు.