బంజారాహిల్స్: మేనల్లుడి (nephew) వరసయ్యే బాలుడిని లైంగికంగా వాడుకోవడమే (Sexwal abuse) కాకుండా వీడియో రికార్డింగ్స్ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, నగదు తీసుకున్న మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకిలోని సాలార్జంగ్ కాలనీలో నివాసముండే మహిళ (34) తన కుటుంబంతో సహా రెండు నెలల కిందట గాయత్రీహిల్స్కి మకాం మారింది.
ఆ సమయంలో కొన్ని నగలు కనిపించకపోవడంతో అనుమానంతో కొడుకు(14)ను గట్టిగా ప్రశ్నించింది. బెంగళూరులో ఉండే మేనత్త (33)కు ఆభరణాలు ఇచ్చానని చెప్పాడు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చే మేనత్త నేరుగా తన స్కూల్కు వచ్చేదని, చార్మినార్ ప్రాంతంలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి లైంగికంగా వాడుకుందని, ఆ మొత్తం వ్యవహారాన్ని ఇర్ఫాన్ అనే వ్యక్తి వీడియోలు తీశాడని వెల్లడించాడు. ఆ వీడియోలు బయటపెడతామంటూ ఇద్దరూ బెదిరించడంతో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షల నగదు వారికి ఇచ్చానని చెప్పాడు. దీంతో బాలుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.