ఎదులాపురం, అక్టోబర్ 14: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర సమీప దిమ్మ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో వ్యవసాయ పనులు చేస్తున్న స్థానికురాలు శ్వేత సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది.
పక్క చేనులో పని చేస్తున్న వారు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కుపోయింది. స్థానికులు ఆమెను 108 వాహనంలో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలిం చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.