బాసర, జూన్ 12 : నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ వద్ద గురువారం రైలులోని బోగిలో ఒక మహిళ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ధర్మాబాద్ మండలం కర్కెళ్లికి చెందిన గర్భిణి నాగేశ్వరి(32) నిజామాబాద్లో చికిత్స తీసుకుని తమ గ్రామానికి వెళ్లేందుకు కాచిగూడ-నాగర్సోల్ రైలు ఎక్కింది.
బాసర వద్ద పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు రైల్వే పోలీస్ సురేశ్, స్టేషన్ మేనేజర్ రవీందర్కు సమాచారం అందించారు. అప్పటికే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా.. వారిని అంబులెన్స్లో భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అంబులెన్సు పైలట్ నవీన్ తెలిపారు.