హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెలుచుకున్నది. మెహ్జూ జ్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో పది లక్షల దిర్హామ్ల బహుమతి దక్కించుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన హమీదా బేగం యూఏఈ రాజధాని అబుధాబిలో మూడేండ్లు మెడికల్ కోడర్గా ఉద్యోగం చేస్తున్నది. 122వ వారం మెహ్జూజ్ డ్రా ఈ నెల 1న నిర్వహించగా, తాజాగా విజేతలను వెల్లడించారు. గెలుచుకున్న సొమ్మును తన నలుగురి పిల్లల విద్యాభ్యాసంతోపాటు కుటుంబ పోషణకు వినియోగిస్తానని హమీదా వివరించింది. కాగా లక్కీ డ్రాలో పదిలక్షల దిర్హామ్లు గెలుచుకున్న తొలి మహిళగా నిలిచింది.