హైదరాబాద్ సిటీబ్యూరో/పోచారం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): పెండ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని నమ్మించి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటన నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అందరికి తెలియడంతో అవమానాన్ని భరించలేక యువతి నెలరోజుల తర్వాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అన్నోజిగూడ ఆర్జీకే కాలనీలో నివాసముంటున్న యు వతి (24) కుటుంబం కొన్నేండ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి నివసిస్తున్నది.
ఈ క్రమంలో యువతి దగ్గర బంధువైన ఓ యువకుడిని ప్రేమించింది. వీరిద్దరికి పెం డ్లి కూడా చేయాలని వారి తల్లిదండ్రులు భావించారు. అయితే యువకుడి తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉండటంతో కొన్నాండ్ల క్రితం అతడి తండ్రి చనిపోయాడు. దీంతో యువకుడికి పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ ఉన్నట్టు లేలడంతో పెండ్లిని రద్దు చేశారు.
యువకుడు మాత్రం తన పెండ్లిని నిరాకరించిందనే కోపంతో యువతికి తన రక్తాన్ని గతనెల 11న ఎక్కించా డు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడు కటకటాల పాలయ్యాడు. అయితే ప్రేమించిన వాడే తన జీవితాన్ని నాశనం చేశాడని యువతి శుక్రవా రం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.