సూర్యాపేట : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీమిరెడ్డి నర్సింహ రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణలో ఆకలి కేకలు మటు మాయమయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy) అన్నారు. బీఎన్ రెడ్డి (BN REDDY) శతదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా
ఆత్మకూరు(S )మండలం దాచారం గ్రామం తుమ్మల పెన్ పహాడ్ ఎక్స్ రోడ్ లో బీ.ఎన్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం దాచారం గ్రామం లో బీ. ఎన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బీ.ఎన్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణ చరిత్రలో ఆయనకు ప్రత్యేక పుట ఉందని గుర్తు చేశారు. విసునూరు దేశ్ముఖ్ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా మలుపు తిప్పిన వ్యూహకర్త బీ. ఎన్ రెడ్డి అన్నారు.
తుంగతుర్తి , సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జలాల(Godavari water) ను తీసుకు రావాలనే బీ.ఎన్ చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) నెరవేర్చారని అన్నారు. బీ.ఎన్ స్పూర్తి తో తెలంగాణ లో ఆకలి కేకలు మటుమాయం అన్నారు. ప్రాజెక్టు లకు బీ.ఎన్ పేరు నామకరణం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెలుతానని మంత్రి అన్నారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మకూర్ యస్ మండల ఎంపీపీ స్వర్ణలత చంద్రారెడ్డి, బీ.ఎన్ కుమారుడు ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.