MLC Elections | హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు( Teacher MLC Elections ) ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను( Wine Shops ) శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ( Excise Department ) ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.