హైదరాబాద్, నవంబర్24 (నమస్తే తెలంగాణ): నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.
గురువారం ఆయన హైదరాబాద్లోని కమిషనరేట్లో చైర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రిలయన్స్ సెలూన్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నదని, అదేజరిగితే నాయీబ్రాహ్మణులు రోడ్డు పాలు కావాల్సి వస్తుందని వివరించారు. ఈ వృత్తిలో కి కార్పొరేట్ సంస్థలు రాకుండా అడ్డుకోవాలని కోరారు. చైర్మన్ను కలిసినవారిలో కుమారస్వామితోపాటు పలువురు బీసీ దళ్ నేతలు ఉన్నారు.