బీసీల సమస్యలు పరిష్కరించకపోతే కేంద్రంపై తిరుగుబాటే: కృష్ణయ్య
కాచిగూడ, ఫిబ్రవరి 27: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ ధ్వజమెత్తారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల సమ్యల పరిష్కారానికి త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్ను ముట్టడిస్తామని ప్రకటించారు. పదోన్నతుల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ కమీషన్కు రాజ్యంగబద్ధత కల్పించాలని, క్రిమిలేయర్ విదానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులాలవారీగా జనగణన జరపకపోతే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిరంజన్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.