హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వేసే ప్రతి అడుగు విజయ పథమేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. దసరా రోజు కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయపార్టీ అద్భుత విజయాలు సా ధించాలని ఆకాంక్షిస్తూ మంగళవారం వారు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి, విజయవాడ కనదుర్గమ్మకు మొక్కులు సమర్పించారు. అనతికాలంలోనే తెలంగాణను దేశానికే రోల్మాడల్గా చేసిన సీఎం కేసీఆర్ పాలనానుభవంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపాలని వారు ఆకాంక్షించారు. వీరి వెంట టీఆర్ఎస్ నేత జిన్నారం వెంకటేశ్ గౌడ్ తదితరులున్నారు.