హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్ పిటిషన్లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది. వాస్తవానికి సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్లోనే వెలువరించాల్సి ఉంటుం ది. సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాష లో ఉంటే వాటిని ఇంగ్లిష్లోని అనువదించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీం కోర్టు, హైకోర్టుల రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించవు. అలాంటిది.. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు చెప్పి, కొత్త చరిత్ర లిఖించారు న్యాయమూర్తులు. ఈ మేరకు 45 పేజీల తీర్పును తెలుగులో వెలువరించారు. అప్పీల్ కోసం ఇంగ్లిష్లోనూ తీర్పు చెప్పి.. ఇంగ్లిష్ తీర్పును ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ బొల్లారం గ్రామానికి చెందిన కే చంద్రారెడ్డి, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా కే ముత్యంరెడ్డి మరో నలుగురు కుటుం బ సభ్యులు ఉన్నారు. చంద్రారెడ్డి తండ్రి కౌకుంట్ల వీరారెడ్డికి మచ్చబొల్లారంలోని సర్వే 162, 163ల్లో 13 ఎకరాల 01 గుంట భూమి ఉన్నది. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు, తల్లి పం చుకున్నారు. తల్లి సాలమ్మ మరణానంతరం ఆమెకు చెందిన సర్వే 162/పార్ట్ లోని 4.08 ఎకరాల భూమి వివాదంపై చంద్రారెడ్డి అప్పీ ల్ దాఖలు చేశారు. తల్లి వీలునామా ప్రకారం తనకే భూమి దక్కాలని వాదించారు. అయితే, సాలమ్మ వీలునామా భారత వారసత్వ చట్టం-1925కు అనుగుణంగా లేనందున.. ఆ వీలునామా చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సాలమ్మ ఆస్తికి హిందూ వారసత్వ హ క్కుల చట్టం ప్రకారం అందరూ అర్హులు అని తెలుగులో తీర్పు ఇచ్చింది.