బీజేపీ ఎంపీలకు సత్తా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుకు కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించేలా చూడాలి. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వ హామీ ఏమైంది. బీజేపీ ఎంపీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేని దద్దమ్మలు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోవడంలో అంతర్యమేంటి. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డుపడుతోన్న బీజేపీ నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెప్తారు.
–హుజూరాబాద్లో మీడియాతో బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్