మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 24: మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో భర్త పేరిట గుడి నిర్మించి, అందులో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నది కళ్యాణి. బానోత్ హరిబాబు-కళ్యాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 2020లో కరోనా సోకి హరిబాబు చనిపోయాడు. భర్తను ఏదో రూపంలో చూసుకోవాలనుకున్న కళ్యాణి తండా చివర ఉన్న తన భూమిలో ఆలయాన్ని నిర్మించింది. పాలరాతితో భర్త విగ్రహాన్ని తయారు చేయించి బుధవారం ఆవిష్కరించింది. భర్త జయంతి, వర్ధంతిని నిర్వహించి అన్నదానం చేస్తానని పేర్కొన్నారు.