ట్విట్టర్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
‘ఆదిలాబాద్ సీసీఐని ఎందుకు అమ్ముతున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి. అక్కడ 770 ఎకరాల భూమి, 48 మిలియ న్ టన్నులకుపైగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. సిమెంట్ ధరలు భారీగా పెరగడం డిమాండ్ను సూచిస్తున్నది’ అని ఆయన ట్వీట్ చేశారు.