హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్సేల్ చేపల మారెట్ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సుమారు రూ.50 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మాణం చేపడతామన్నారు. హోల్సేల్, రిటైల్ మారెట్తో పాటు కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, పశు గణాభివృద్ధి శాఖలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి వనరులు భారీగా అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు ప్రతి నీటి వనరులో చేపపిల్లలను వదలడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు.
ఈ దశలో చేపలను తకువ ధరకు అమ్ముకొని మత్స్యకారులు నష్టపోకుండా మారెటింగ్పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హోల్సేల్ మారెట్ అందుబాటులోకి వస్తే చేపలకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. మార్కెట్ నిర్మాణానికి ఇతర రాష్ట్రాల్లోని మారెట్లను అధ్యయనం చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. మత్స్యకారుల సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్లో భాగంగా అర్హులైన మత్స్యకారులకు సిల్ టెస్ట్లో అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు.
అన్నిజిల్లాల్లో గొర్రెలు, మేకల మారెట్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గొర్రెలు, మేకల మారెట్ల నిర్మాణానికి చర్యలను వేగవంతం చేయాలని డైరెక్టర్ రామచందర్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. పశుసంవర్ధక శాఖపై సమీక్షలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే స్థలాలు గుర్తించిన చోట పనులు ప్రారంభించాలని, మిగతా జిల్లాల్లో వారంలోగా స్థలాల సేకరణ జరగాలన్నారు. జీవాలకు వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ కోసం హెల్త్ క్యాలెండర్ను రూపొందించినట్టు చెప్పారు. పశుసంవర్ధక శాఖ తీసుకున్న జాగ్రత్తలతో తక్కువ కాలంలోనే లంపీసిన్ వ్యాధిని నివారించగలిగామన్నారు. 1880 గ్రామాల్లో 9,317 పశువులు ఈ వ్యాధి బారిన పడగా 66 మృత్యువాత పడ్డాయన్నారు. వ్యాధి నివారణ కోసం 30.95 లక్షల పశువులకు టీకాలు, అవసరమైన మందులను సరఫరా చేశామని, ఇందుకు రూ.1.85 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.
మార్చిలో కంసాన్పల్లి పశువీర్య కేంద్రం ప్రారంభం
కృత్రిమ గర్భధారణలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని మంత్రి తలసాని అన్నారు. పశు గణాభివృద్ధి సంస్థ సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ పశువీర్య ఉత్పత్తి కోసం రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి వద్ద నిర్మిస్తున్న కేంద్రాన్ని మార్చిలో ప్రారంభిస్తామన్నారు. టీఎస్ఎల్డీఏ ఆధ్వర్యంలో 500 శిబిరాలు నిర్వహించి 11.97 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించగా, 3 లక్షల దూడలు పుట్టినట్టు చెప్పారు. డిసెంబర్ వరకు 16.20 లక్షల డోసుల పశువీర్యం ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రజలకు తకువ ధరకు నాణ్యమైన మాంసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒక అత్యాధునిక ఔట్ లెట్ను ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని అన్నారు. ఇదే శాఖ పరిధిలోని వీబీఆర్ఐ ద్వారా జీవాలకు అవసరమైన 6 రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో షీప్ ఫెడరేషన్, విజయ డెయిరీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, సోమా భరత్కుమార్, పశుసంవర్థ్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అదర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్థ్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు.