హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ యంగ్స్టర్స్ పలు ప్రశ్నలను సంధించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు విచ్చేసిన మోదీకి యువత చురకలంటిస్తూ.. తెలంగాణకు సమానత్వం ఎక్కడ? అని నిలదీశారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న మోదీపై యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఈ కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీస్తూ.. ఓ భారీ బ్యానర్ను ప్రదర్శించారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు విచ్చేసిన మోదీకి యువత చురకలంటిస్తూ.. తెలంగాణకు సమానత్వం ఎక్కడ? అని హైదరాబాద్ యంగ్స్టర్స్ నిలదీశారు. తెలంగాణకు ఇవ్వాల్సిన కేటాయింపులపై.. ఓ భారీ బ్యానర్ను ప్రదర్శించారు @KTRTRS https://t.co/IOGXsqgDX8 pic.twitter.com/jQ2dHK4WMg
— Namasthe Telangana (@ntdailyonline) February 5, 2022
రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ? ఐటీఐఆర్ ఎక్కడ? పసుపు బోర్డు సంగతేంటి? తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎక్కడ? హైదరాబాద్ మెట్రో ఫండ్స్ కేటాయింపులెక్కడ? ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ఎక్కడ? మెడికల్ కాలేజీల సంగతేంటి? అని మోదీని యువత నిలదీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #EqualityForTelangana అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.