హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్సు ఉద్యోగ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,204 పోస్టులకు ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, జనవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 9 విభాగాల్లో స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. తాజాగా ఈ ఉద్యోగ పరీక్షకు వచ్చే అభ్యర్థులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్ష హాలులోకి పెన్ను, హాల్టికెట్, గుర్తింపుకార్డు మాత్రమే తీసుకురావాలని బోర్డు పేర్కొన్నది.