న్యూఢిల్లీ: రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ దీక్ష కొనసాగుతున్నది. అయితే దీక్ష వేదిక వద్ద టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కూడిన బీజేపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. కాగా, వాటిపై ఉన్న ఫొటోల్లో వడ్లకు బదులు గోధుమలు, గోధుమ కంకులను ఉంచారు. దీంతో బీజేపీ నేతలకు వడ్లకు, గోధుమలకు తేడా తెలియకుండా పోయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
బీజేపీ ఫ్లెక్సీలపై పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీది గోధుమల పార్టీ.. మాది వడ్ల పార్టీ. అంతేగా.. #తొండి_గంజాయి!?’ అని, ‘కుక్కలెక్క ఒర్రుడు తప్ప.. వరికి గోధుమలకు తేడా కూడా తెల్వదా తేడాసింగ్’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.