హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. సింగరేణిలో అమలుచేస్తున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, పదోన్నతులు తదితర అంశాలపై సోమవారం సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 17 నుంచి 20 శాతం వరకు అమలు చేయడం అభినందనీయమన్నారు.
అంబేద్కర్ జయంతిని సెలవుగా ప్రకటించడం, ఆ రోజున ఉత్సవాల నిర్వహణకు ఒక్కో ఏరియాకు రూ.60 వేలు మంజూరు చేయడం ప్రశంసనీయమని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక చీఫ్ లైజన్ ఆఫీసర్తోపాటు ప్రతి ఏరియాలో ఏరియా ఆఫీసర్లను నియమించామని తెలిపారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ బలరాం, జాతీయ ఎస్సీ కమిషన్ హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్కుమార్ బాబు, ప్రైవేటు సెక్రటరీ నవీన్ రోహిలా, సింగరేణి డైరెక్టర్లు ఎస్వీకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.