సంగారెడ్డి : సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలకు రూప కల్పన చేశారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్, నాగదర్, రాంచందర్ నాయక్ తండాలో ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ గుర్రపు సుశీలతో కలిసి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రారంభించారు.
రాంరెడ్డిపేట్, మిర్కాన్పేట్, ఇందిరనగర్, పొమ్యానాయక్ తండా, మహాదేవుపల్లి గ్రామాలల్లో ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసంగీలో రైతులు ఏ పంటలు పండించినా రైతుబంధు, రైతు బీమా వస్తుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పై ప్రత్యేక దృష్టి సారించి నూతన ప్రాజెక్టులను నిర్మించారన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. రైతులకు పండించిన పంటలకు మద్దతు ధరను అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైకార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, డీసీసీబీ డైరెక్టర్ గుండు వెంకట్రాములు, కృష్ణాపూర్, నాగదర్ సర్పంచ్లు కిష్టారెడ్డి, రవీలా, ఏడీఏ కరుణకర్రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.