హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఎంపికైన 332మంది నర్సింగ్ అభ్యర్థులకు వెంటనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెబ్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంలో అధికారు లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు.
వెబ్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో పోస్టింగ్ ఎక్క డ వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సర్కార్ నిర్లక్ష్యంతో తమ పిల్లలు ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై పలుమార్లు ఉన్న త అధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.