Weather Update | తెలంగాణలో రాబోయే మూడురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య నుంచి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంజెటెక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. అలాగే, దక్షిణ మధ్యప్రదేశ్లో ఉన్న ఉపరితల ఆవర్తం విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్, యానంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని చెప్పింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో మూడునాలుగు రోజులు వానలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది. 17న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది.