హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు, కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చా రు. ఏఐటీయూసీ మూడు రోజుల జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో ఆదివారం ఆన్లైన్లో జాతీయస్థాయి బహిరంగ సభ నిర్వహించారు. కౌర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పాలనలో నిరుద్యోగిత రేటు 8.1 శా తానికి చేరుకున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ శాఖల్లో 9 లక్షల ఉద్యోగాలుఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. మార్చి 29, 30 తేదీల్లో నిర్వహిం చే సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోదీకి గుణపాఠం చెప్పాలని రాజ్యసభలో సీపీఐ పక్ష నాయకుడు బినో య్ విశ్వం పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్పాషా, ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు ఎస్ బాల్ సమావేశంలో పాల్గొన్నారు.