Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు అందించే బాలామృతం నాణ్యత మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. రెండు రోజుల అహ్మదాబాద్, ఇండోర్ పర్యటనలో భాగంగా మొదటిరోజు గుజరాత్ రాష్ట్రం కైరా జిల్లా ఆనంద్లోని అమూల్ టెక్ హోం రేషన్ ఫ్యాక్టరీని సందర్శించారు.
ఈ సందర్బంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. అమూల్ ఫ్యాక్టరీలో వినియోగిస్తున్న యంత్రాలు కావచ్చు. సాంకేతికత కావచ్చు అధునాతనమైనవని తెలిపారు. ఇక్కడ ఉపయోగించే రోస్టర్ల వల్ల నాణ్యమైన పోషకాహారం ఉత్పత్తితో పాటు గణనీయంగా కరెంటు చార్జీలు తగ్గించుకోవచ్చని వివరించారు. ఇప్పటీకే మనం ఆసియాలో అతి పెద్ద ప్లాంట్ ద్వారా బాలమృతం ఉత్పత్తి చేస్తున్నామని ఈ రోస్టర్లను మనం ప్రవేశపెడితే ఇంకా నాణ్యమైన పౌష్టికాహారం ఉత్పత్తి చేసి పిల్లలకు అందించి రాష్ట్రాన్ని పోషకాహార లోపం లేకుండా చేయవచ్చన్నారు. దీంతో పాటు వ్యయం తగ్గుతుందని తెలిపారు. గుజరాత్లో బాల శక్తి పేరుతో అందిస్తున్న బాలామృతం తయారీకి 75 రూపాయలు ఖర్చు అవుతుంటే మనకు 50 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ పర్యటనలో జీఎమ్ విజయలక్ష్మీ, ఎజీఎమ్లు శ్రీనివాస్ నాయక్, ఎలమంద పాల్గొన్నారు.
రెండు రోజుల అహ్మదాబాద్ ఇండోర్ పర్యటనలో భాగంగా మొదటి రోజు కైరా జిల్లా ఆనంద్ లోని అమూల్ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఫ్యాక్టరీ మేనేజర్ రాజేష్ పాటోడియాతో సమావేశమై ఉత్పత్తి తీరు, వినియోగిస్తున్న యంత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/WMo3xFiHRy
— Rajeev Sagar Meday (@RajeevSagarM) July 14, 2023