హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సమ్మక్క జాతరను విజయవంతం చేసినట్టు చెప్పారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.