హైదరాబాద్ : కాంగ్రెస్ ( Congress ) అధికారంలో కి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. ఇందిరా పార్కు వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణ , ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.15 రోజులలో సమస్యలు పరిష్కరించకుంటే ఛలో సెక్రెటరీయేట్, అసెంబ్లీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప పేద ప్రజల సమస్యలు పట్టవని, ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అని విమర్శించారు.