హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఇబ్బందులను పరిష్కరిస్తామని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదురొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్రెడా య్, నరెడో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, వాణిజ్య పన్నులు, కార్మికశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎస్.. సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.