నారాయణపేట/నారాయణపేట రూరల్;నారాయణపేట కోర్టు సముదాయంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులను శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, మహబూబ్నగర్ ప్రిన్సిపల్ జడ్జి ప్రేమావతి, పోక్సో జడ్జి ఉమాదేవి, సీనియర్ సివిల్ జడ్జి శుభవల్లి, జూనియర్ జడ్జి రాజేందర్, మహబూబ్నగర్ సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.