హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించబోమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్సింగ్ స్పష్టంచేశారు. మంగళవారం రాజేంద్రనగర్లోని ఎన్ఎఫ్డీబీ కార్యాలయానికి సందర్శించిన ఆయనతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ తరలింపుపై ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఈ మేరకు స్పష్టతనిచ్చారు.
విద్యపై సమావేశం పెట్టండి: ఎస్టీయూ టీఎస్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎస్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్లు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.