CM KCR | బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్ది ప్రాఫిట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్ అని కేసీఆర్ అన్నారు. ‘మోదీ ఎల్ఐసీ అమ్ముతా అని అంటున్నవ్.. అమ్మేయ్ పర్వా లేదు. 2024 తర్వాత నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి.. గ్యారంటీగా ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్లను వాపస్ తీసుకుంటాం. ఎల్ఐసీ సోదరులకు 42లక్షల కోట్ల ఆస్తులు ఉన్నయ్. లక్షలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుడి కుటుంబంతోని పెనవేసుకొనిపోయిన పేగుబంధం ఉన్న సంస్థ ఎల్ఐసీ. అప్పనంగా, వడ్డీకి పావుషేరు ఇష్టం వచ్చిన షావుకార్లకు అమ్ముతామని ఉవ్విళ్లూరుతున్నవ్.. మళ్లీ వాపస్ తీసుకుంటాం. ఎల్ఐసీ కార్మికులు, మిత్రులు సింహంల్లా గర్జించండి. బీఆర్ఎస్ను బలపరచండి.. ఎల్ఐసీని రక్షించుకుందాం’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
‘స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాక లక్షల కోట్ల జెన్కో, ట్రాన్స్కో ఆస్తులు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నయ్. అవి ప్రజల ఆస్తులు. అప్పనంగా లాస్ చూపించి షావుకార్లకు అప్పజెప్పి ప్రజల ముక్ముపిండి దాన్ని ప్రైవేటు చేసి అప్పనంగా అమ్ముతాముంటున్నారు. భారతదేశంలాంటి పెద్ద దేశంలో కరెంటు ముఖ్యమైన విషయం కాబట్టి, ప్రగతి సూచికల్లో మొదటిది కాబట్టి.. కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్లోనే ఉంచుతాం.. ఇదే బీఆర్ఎస్ పాలసీ.. కరెంటు కార్మికులారా.. పిడికిలి బిగించాలి’ అన్నారు. ఇక మాట్లాడమంటే రేకుడబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లే లోడాలడ మాట్లాడుతరు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిండా నీళ్లున్నా.. మంచినీళ్లివ్వలేని అసమర్థ పాలకులు కావాలా? ఇంకా చాలదా? మనకు సిగ్గు రావాద్దా..? కరెంటు ఇవ్వరు.. నీళ్లు ఇవ్వరు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి’ అని ప్రశ్నించారు. ‘కరెంటుకు లక్షల మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకీ నదులు బిహార్ను కరువులు, వరదలతో ముంచెత్తుతున్నయ్. ప్రతి సంవత్సరం సగం బిహార్ వరదలు, సగం బిహార్ కరువు. హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ పెడితే అద్భుతమైన కరెంటు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలను మోసం చేసేందుకు, గోల్మాల్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.