సిద్దిపేట : జిల్లాలోని చిట్టాపూర్లో టైరు పగిలి వ్యవసాయ బావిలో పడ్డ కారును, అందులోని మృత దేహాలను బయటకు తీసేందుకు వెళ్లి గజఈతగాడు నర్సింహులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సిద్దిపేట ఆర్డీఓ అనంత రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని బెనిఫిట్స్ను అందిస్తామన్నారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ సహకారం కింద రూ. 6 లక్షల పరిహారం అందే అవకాశం ఉంటుందన్నారు. దీనితో పాటు బాధిత కుటుంబానికి తక్షణం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తామని అనంత రెడ్డి తెలిపారు.