వనపర్తి, డిసెంబర్ 7 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు(Local body elections) బీర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Former minister Niranjan Reddy) సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రజలు, కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. ప్రతి నిత్యం నాయకులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటిలాగానే ప్రతి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు అశోక్, ప్రేమ్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.