హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆఫీస్ స్పేస్లో హైదరాబాద్ నగరం బెంగళూరును అధిగమించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.అనరాక్ సంస్థ.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ విక్రయ వివరాలను విడుదల చేసింది. ఈ నివేదికపై స్పందించిన మంత్రి కేటీఆర్ బెంగళూరు నగరాన్ని అధిగమించి హైదరాబాద్ అగ్రగామిగా నిలిచిందని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
స్టార్టప్ బృందానికి కేటీఆర్ అభినందనలు
తెలంగాణకు చెందిన మరో స్టార్టప్ ప్రపంచ స్థాయిలో నిలిచింది. దాంతో మంత్రి కేటీఆర్ స్టార్టప్ బృందాన్ని అభినందించారు. రాష్ట్ర ఖైతీ బృందం.. గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ స్టార్టప్ 2022 ఎర్త్షూట్ ప్రైజ్ను గెలుచుకొన్నది. ఒక మిలియన్ పౌండ్లను అవార్డుగా అందించారు. రిచ్ సంస్థ, టీ హబ్ ప్రోత్సహించిన స్టార్టప్నకు గుర్తింపు రావడం అభినందనీయమని మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.