వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలి
జిల్లా అధికారుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి సూచన
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. గురువారం బంజారాహిల్స్ క్యాంపు ఆఫీస్నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో వెబ్కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9.8 లక్షల పనిదినాలు కల్పించామని, మొత్తం లక్ష్యం 13 కోట్ల పనిదినాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో గ్రామాలకు వలస వెళ్తున్నవారికి ఏప్రిల్ నెలాఖరు నాటికి లక్షకుపైగా జాబ్కార్డులు జారీ చేశామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు జర్వ సర్వేలో పాల్గొనాలని, వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘనందన్రావు, డిప్యూటీ కమిషనర్ రామారావు పాల్గొన్నారు.