రామగిరి మే 22: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి ఎక్స్రోడ్లో సులభ్ టాయ్లెట్ కాంప్లెక్స్ కూల్చివేతలో తమ పార్టీ ప్రమేయం లేదని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రొడ్డ బాపన్న స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఈ విషయమై గ్రామ కాంగ్రెస్ నాయకులు తీగల సమ్మయ్య, ఎరుకల ఓదెలుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న కొన్ని కట్టడాలను ఆర్అండ్బీ అధికారుల ఆదేశాలతో కాంట్రాక్టర్ తొలగించారని తెలిపారు. అయితే.. ఆ నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు కూల్చివేయించినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బాపన్న స్పష్టం చేశారు.