కేరళ అగ్రివర్సిటీ నుంచి కొత్త వంగడం
మార్కెట్లోకి షోనిమా, స్వర్ణ రకాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతుల అభిరుచికి అనుగుణంగా, వారికి లాభం తెచ్చిపెట్టేలా పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కొత్త వంగడాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అందులోభాగంగా కేరళ అగ్రివర్సిటీ గింజల్లేని పుచ్చ వంగడాలు రూపొందించింది. ఈ రకాలకు షోనిమా, స్వర్ణ పేరుతో మారెట్లో అందుబాటులోకి తెచ్చింది. కేరళలోని త్రిచూర్ ప్రాంతంలోని పాలిహౌస్లో కేరళ ఉద్యానశాఖ, అగ్రివర్సిటీ సంయుక్తంగా సీడ్లెస్ పుచ్చను సాగుచేసి అబ్బురపరుస్తున్నది. చక్కటి ఫలితాలు ఇచ్చిన ఈ వంగడం ఫలాలు రైతులకు దకేలా మారెట్లో ప్రదర్శనలో పెట్టారు. ఎకరానికి రూ.50 వేలు ఖర్చుపెడితే నాలుగు నెలల్లో పంట చేతికొస్తుందని, రూ.1.2 లక్షల దాకా ఆదాయం తెచ్చిపెడుతుందని అగ్రికల్చర్ సైంటిస్టు డాక్టర్ టీ ప్రదీప్కుమార్ తెలిపారు. కేరళ వ్యవసాయవిశ్వవిద్యాలయంలో ఒకోగింజను రూపాయి చొప్పున అమ్మకానికి పెట్టారు. పూర్తి వివరాలను కేరళ వర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చు. వాణిజ్యపరంగా సాగుచేసి, ఎగుమతి చేసే రైతులకు ఈ పంట సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం విశ్వవిద్యాలయం నుంచి అందిస్తామని ప్రదీప్కుమార్ తెలిపారు.