జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్ నుంచి గురువారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బరాజ్లోని 6వ బ్లాక్లో ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతుండగా అన్నారం బరాజ్ నుంచి నీరు విడుదల చేయడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. అన్నా రం బరాజ్లో ఏర్పడిన సీపేజ్లకు కెమికల్ గ్రౌటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఇంకా ఏమై నా సమస్యలు ఉన్నాయా? అనే విషయమై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పార్సన్ సంస్థ సిద్ధమైంది.
బరాజ్లో నీరు ఉండటంతో ఉన్నతాధికారుల అనుమతితో గురువారం నీటిని విడుదల చేశారు. ఈ విషయం మేడిగడ్డ బరా జ్ అధికారులకు తెలియకపోవడంతో నీళ్లు రావడం చూసి అధికారులను నీటిని నిలిపివేయాలని కోరారు. దీంతో అధికారులు అన్నారం బరాజ్ నుంచి నీటి తరలింపును ఆపేశారు. మేడిగడ్డ ఇన్వెస్టిగేషన్ పను ల్లో జాప్యం జరుగుతండటంతో అన్నారం బరాజ్ ఇన్వెస్టిగేషన్ పనులు నిలిచిపోతున్నాయి.