భద్రాచలం: ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరిలో 43.8 అడుగులకు నీటిమట్టం చేరింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదారిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.